బ్రేకింగ్ : ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా..రవాణా మంత్రి పువ్వాడకు గవర్నర్ ఫోన్
ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడకు ఫోన్ చేసిన గవర్నర్ తమిళిసై ఆర్టీసీ సమ్మె ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలపై వివరాలు అడిగారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్లో మంత్రి పువ్వాడ అజయ్తో పాటు ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు ఆదేశాలపై చర్చిస్తున్నారు.