రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై నూతన సంవత్సన శుభాకాంక్షలను తెలిపారు.

Update: 2020-01-01 10:30 GMT
Governor Tamilisai Soundararajan

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై నూతన సంవత్సన శుభాకాంక్షలను తెలిపారు. 2020లో ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని ఆకాక్షించారు. ప్రజలు నూతనోత్సాహంతో ముందుకు సాగాలని ఆమె కోరారు. బుధవారం (జనవరి 1న) దర్బార్‌హాల్‌లో ఉదయం 11 నుంచి 12 గంటలదాకా ప్రజలు, నాయకులను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్ భవన్ కు వచ్చిన ప్రజలను కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి ఇప్పటికి వంద రోజులు పూర్తయ్యాయని వారు ఈ సందర్భంగా తెలిపారు. బోడగూడెం అనే ట్రైబల్ గ్రామానికి చెందిన కొంతమంది తనను కలిసి వాళ్ళ సమస్యలు వివరించారని వారు తెలిపారు. వారి సమస్యల తెలుసుకున్నారని పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌భవన్‌లో బ్లడ్ డొనేషన్ యాప్ విడుదల చేశారని, రాజ్‌భవన్ ఆధ్వర్యంలో దానిపై పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు.  

Tags:    

Similar News