ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడకు ఫోన్ చేసిన గవర్నర్ తమిళిసై. సమ్మె ప్రభావం ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలపై వివరాలు అడిగారు. సమ్మెపై వివరాలు అందించాలని గవర్నర్ ఆదేశించడంతో మంత్రి పువ్వాడ రవాణాశాఖ సెక్రటరీని రాజ్భవన్కు పంపారు. అయితే, త్వరలోనే మంత్రి పువ్వాడ అజయ్ కూడా గవర్నర్ను కలిసి ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.