భద్రాచలం అభివృద్ధిని ప్రభుత్వాలు విస్మరించాయి : జిట్టా

Bhadrachalam: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాచలం అభివృద్ధిని విస్మరించాయని జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు.

Update: 2021-02-28 01:31 GMT

ఫైల్ ఇమేజ్


తెలంగాణ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాచలం అభివృద్ధిని విస్మరించాయని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు. అభివృద్ధి చేయడం చేతగాని టీఆర్ఎస్‌ నాయకులు ఓట్లు ఎలా అడుగుతారని బాలకృష్ణారెడ్డి ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో యువ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో వరంగల్‌, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి, పార్టి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణి రుద్రమ రెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News