బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. త్వరలో కాంగ్రెస్‌‌లోకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కావ్య

సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి శ్రీహరి, కావ్య

Update: 2024-03-29 06:03 GMT

బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. త్వరలో కాంగ్రెస్‌‌లోకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కావ్య

Warangal: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కూతురు కావ్యతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు కడియం శ్రీహరి. వరంగల్ బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్ధిగా ఉన్న కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కడియం శ్రీహరికి లేదా కావ్యకు కాంగ్రెస్ బరిలోకి దించే అవకాశం ఉంది. కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరికతో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ వీడారు. వరంగల్ లోక్ సభ స్థానం నుంచి ఎవరిని పోటీకి నిలుపాలన్నది బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది.

Tags:    

Similar News