కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి ప్రవాహం.. నీట మునిగిన 17 బాహుబలి మోటార్లు

Kaleswaram: వాటర్ పైకి రావడంతో చేతులెత్తేసిన అధికారులు

Update: 2022-07-14 11:18 GMT

కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి ప్రవాహం

Kaleswaram: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్ని నిండుకుండలా మారాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. కాళేశ్వరంలోని కీలకమైన కన్నెపల్లి పంప్‌హౌస్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. పంపు హౌస్‌లోని 17 బాహుబలి మోటార్లు నీటమునిగాయి. గ్రౌండ్ లెవల్లో ఉన్న మోటార్లు పూర్తిస్థాయిలో మునిగిపోవడంతో ఏం చేయలేని పరిస్థితిలో అధికారులు వెనుదిరిగారు.

Tags:    

Similar News