ఒక అమ్మాయితో నిశ్చితార్ధం అయ్యాక మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు.. దీనితో మనస్తాపానికి గురైన మహిళా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే పోలిసుల వివరాల ప్రకారం సుబ్బలక్ష్మి కూతురు మల్లీశ్వరి(24) కి సమీప బంధువు అయిన మారం సుధాకర్ తో నిశ్చితార్ధం అయింది. ఈ క్రమంలో మల్లీశ్వరి బంధువులు మరణించడంతో వివాహనికి సమయం ఏర్పడింది. ఈ నేపధ్యంలో సుధాకర్ మల్లీశ్వరితో వివాహానికి నిరాకరించాడు. దీనితో భాదితులు పొలిసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.చివరికి బంధువులు కలిసి నచ్చజెప్పడంతో ఒప్పుకున్నాడు. కానీ ఈ నెల తొమ్మిదిన నెల్లూరులోని ఓ యువతిని పెళ్లి చేసుకొని అందరు బంధువులకి తెలియజేయడంతో మల్లీశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మల్లీశ్వరి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.