జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు కొరడా ఝుళిపించాయి. హైదరాబాద్లో అగ్నిప్రమాద నివారణ నిబంధనలు పాటించని బార్లపై చర్యలు తీసుకున్నాయి. కొత్తపేటలో మనో రంజిత్ బార్ & రెస్టారెంట్ , ఎల్బీ నగర్ కామినేని రోడ్డులో సిల్వర్ లీఫ్ బార్ అండ్ రెస్టారెంట్ ను , వనస్థలిపురం మన్సూరాబాద్లో తిరుమల బార్ అండ్ రెస్టారెంట్ను సీజ్ చేశాయి. ఈ 3 బార్లు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవటంతో పాటు ఫుట్పాత్లను ఆక్రమించడంతో జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చర్యలు చేపట్టింది.