ఊపిరి పీల్చుకున్న మేయర్ కుటుంబం..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్కు కరోనా సోకడంతో శుక్రవారం మేయర్ కు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్కు కరోనా సోకడంతో శుక్రవారం మేయర్ కు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ పరీక్షల్లో ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా నెగెటివ్గా నిర్దారణ అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఇంతకముందే జీహెచ్చ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్కు కరోనా పరీక్షలు చేయగా అప్పుడు నెగిటివ్ వచ్చింది. ఆ తరువాత గురువారం మేయర్ పేషీలోని మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు బొంతు రామ్మోహన్కు మరోసారి పరీక్షలు చేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్లో ఉన్నారు.