ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికలకు సిద్హమౌతుంది. ఇటీవలే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగినిన విషంయం తెలిసిందే. కాగా వచ్చే నెల 3, 4 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈవోలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఇందుకోసం ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలని సూచించింది. కాగా మండలపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) పరిధిలో ఉన్న ఆయా గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను మండలపరిషత్ కార్యాలయాల్లోనూ, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జడ్పీటీసీ) పరిధిలోని అన్నీ గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాను జడ్పీ కార్యాలయాల్లోనూ పరిశీలనకు ఉంచాలని పేర్కొంది. కాగా పరిషత్ ఎన్నికలపై రాష్ట్ర సర్కార్ నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలుస్తోంది.