నాగార్జునసాగర్ 4గేట్లు ఎత్తివేత
నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. సాగర్కు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు సాగర్లోని 4 క్రస్ట్ గేట్లను తెరిచారు.
నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. సాగర్కు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు సాగర్లోని 4 క్రస్ట్ గేట్లను తెరిచారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 559.340 అడుగులకు చేరింది. జలశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీ కాగా.. ప్రస్తుతం 228.983 టీఎంసీలకు చేరింది. గంటకు అడుగు చొప్పున జలాశయ నీటిమట్టం పెరుగుతోంది.