మెదక్‌ జిల్లాలో ఒకే ఇంట్లో నలుగురికి కరోనా పాజిటివ్‌

Update: 2020-04-03 12:02 GMT
testing kits for corona (representational image)

మెదక్‌ జిల్లాలో ఒకే ఇంట్లో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అజంపురాకు చెందిన వ్యక్తి మత ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన అనంతరం పరీక్షించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారి కుటుంబ సభ్యులను పరీక్షించగా ఈ రోజు ఆ వ్యక్తి భార్య, కోడలు, కూతురుకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయిందిని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు తెలిపారు.

వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారు ముందుకు వచ్చి సమాచారం ఇవ్వలని కోరారు. ఆ కుటుంబం ఎవరెవరిని కలిసారని వైద్య సిబ్బంది, పోలీసులు ఆరా తీస్తున్నారు. 

  

Tags:    

Similar News