మెదక్ జిల్లాలో ఒకే ఇంట్లో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అజంపురాకు చెందిన వ్యక్తి మత ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన అనంతరం పరీక్షించగా కరోనా పాజిటివ్ వచ్చింది. వారి కుటుంబ సభ్యులను పరీక్షించగా ఈ రోజు ఆ వ్యక్తి భార్య, కోడలు, కూతురుకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయిందిని డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు తెలిపారు.
వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారు ముందుకు వచ్చి సమాచారం ఇవ్వలని కోరారు. ఆ కుటుంబం ఎవరెవరిని కలిసారని వైద్య సిబ్బంది, పోలీసులు ఆరా తీస్తున్నారు.