వరంగల్‌ టెక్సో గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.27 కోట్లు ఆస్తినష్టం...

Warangal: ఏడు ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది...

Update: 2022-04-12 08:21 GMT

వరంగల్‌ టెక్సో గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.27 కోట్లు ఆస్తినష్టం...

Warangal: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం టెస్కో గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిన్న రాత్రి నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఏడు ఫైరింజన్లతో 65 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. దాదాపు 15 గంటలవుతున్నా మంటలు అదుపులోకి రావడం లేదు. ఘటనలో పిల్లలకు సంబంధించిన బెడ్‌ షీట్లు పూర్తిగా దగ్ధం అయినట్లు సమాచారం. సుమారు 27కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం.

Tags:    

Similar News