విజయారెడ్డి హత్యను ఖండిస్తూ రెవెన్యూ ఉద్యోగుల నిరసన.. వీఆర్వోకు షాకిచ్చిన రైతు..

Update: 2019-11-08 11:52 GMT

తహశీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలుపుతుంటే బాధితులు మాత్రం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తహశీల్దార్ విజయారెడ్డి హత్యను ఖండిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిరసన తెలుపుతోన్న రెవెన్యూ ఉద్యోగులకు ఓ రైతు షాకిచ్చాడు. వీఆర్వో శ్రీనివాస్ రెడ్డి తన దగ్గర 4వేల 700 రూపాయలు తీసుకుని పౌతి మార్పిడి చేయడం లేదంటూ నిలదీశాడు. అయితే, తనకేమీ డబ్బులివ్వలేదని బుకాయిస్తూనే వీఆర్వో శ్రీనివాస్ రెడ్డి అక్కడ్నుంచి జారుకున్నాడు.

Tags:    

Similar News