టీఆర్ఎస్ లోకి నామా..! ఖమ్మం ఎంపీ టిక్కెట్..

Update: 2019-03-19 03:36 GMT

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, సీనియర్ నేత నామా నాగేశ్వరావు టీఆరెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. ఆయనకు ఖమ్మం ఎంపీ టిక్కెట్ ఖరారు చేసినట్టు సమాచారం. కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. అయితే మొదట కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చినా ఆయన టీఆరెస్ వైపే మొగ్గుచూపారు. త్వరలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు నామా!

Similar News