జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. హన్మకొండలో చెలిమల్ల రాజయ్య, లక్ష్మి వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆత్మహత్యకు ముందు ఆ వృద్ధ దంపతులు రాసిన వాంగ్మూలం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. తమ ఇద్దరిని ఒకే చోట సమాధి చేయాలని లేఖ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వృద్ధ దంపతులు ఒకేసారి ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంతో చిట్యాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.