ప్రధాని మంత్రి స్కూటీ యోజన అనే పథకమే లేదని మాజీ కేంద్ర మంత్రి, బీజేపి జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేసారు. బీజేపీ మీద బుదర జల్లడానికి ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని వాటిని నమ్మొద్దని ఆమె పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కృషీభవన్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రత్యేక హోదా విషయంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రజలను కన్ఫూజ్ చేశారన్నారు. ముందు ప్యాకేజీ అని, తరవాత హోదా అంటూ మాట మార్చారని ఆరోపించారు. హోదా విషయంలో టీడీపీ చేసిన తప్పే వైసీపీ అధినేత జగన్ చేయకూడదని ఆమె సూచించారు.