పార్టీకి క్షమాపణలు చెప్పిన నారాయణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలం సృస్టించిన దిశ హత్య కేసు నిందితులను చటాన్ పల్లి వద్ద పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Update: 2019-12-08 09:16 GMT
సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలం సృస్టించిన దిశ హత్య కేసు నిందితులను చటాన్ పల్లి వద్ద పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్ కౌంటర్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ ను తాను స్వాగతిస్తూన్నాని ఒక ప్రకటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన జాతీయ కార్యవర్గ సమావేశంలో నారాయణ చేసిన వ్యాఖ్యలను పలువురు నాయకులు ఖండించారు.

దీంతో నారాయణ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నామని, ఇలాంటి సంఘటనలను సీపీఐ ప్రోత్సహించదని ఆయన స్పష్టంచేశారు. వారి ఎన్‌కౌంటర్ పై నేను చేసిన వ్యాఖ్యలు నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై ప్రజా సంఘాలకు, పార్టీకి క్షమాపణ చెపుతున్నానని నారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు.    

Tags:    

Similar News