సీపీఐ కీలక నిర్ణయం

Update: 2019-10-14 15:15 GMT

త్వరలో జరగబోయే హుజూర్ నగర్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన సీపీఐ ఇప్పుడు ఆ మద్దతును ఉపసంహరించుకుంది.. దీనిపై తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేసారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మద్దతు ఉపసంహరించుకున్నట్టు అయన ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వం మొండివైఖరి వీడటం లేదని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో హుజూర్ నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి మద్దతులో యూ టర్న్ తీసుకున్నామన్నారు. జరగబోయే ఉపఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి అన్నది మరో మూడు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు.  

Tags:    

Similar News