సైబరాబాద్ సీపీ సజ్జనార్ రక్తదానం చేశారు. లాక్ డౌన్ వల్ల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అయితే, తలసమియా,క్యాన్సర్,మెడికల్ ఎమర్జెన్సీ ,బ్లడ్ క్యాన్సర్ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రక్తదానం చేసేవారు ముందుకు రావాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. విద్యానగర్ అడిక్మెట్ వద్ద ఉన్న ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్తదాన శిబిరంలో ఆదివారం సజ్జనార్ రక్తదానం చేశారు.
క్యాన్సర్ రోగులు, తలసేమియా బాధితులకు రక్తం అందించేందుకు శిబిరం ఏర్పాటు చేశామని సీపీ చెప్పారు. రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన దాతలు సమాచారం అందిస్తే..వారిని ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లి తిరిగి అదే వాహనంలో జాగ్రత్తగా ఇంటివద్ద దింపుతామని వివరించారు. సజ్జనార్ రక్తదానంపై కేటీఆర్ ట్విటర్ ద్వారా అభినందించారు.
Fabulous job CP Sajjanar Garu 👏 https://t.co/uVuAJDwXUf
— KTR (@KTRTRS) April 12, 2020