నగరంలో ఉచిత క్యాబ్ సర్వీసులు ప్రారంభం..

ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మహేంద్ర లాజిస్టిక్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది.

Update: 2020-04-15 05:21 GMT

ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మహేంద్ర లాజిస్టిక్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది.సీనియర్‌ సిటిజన్స్‌, ఒంటరి తల్లులు, దివ్యాంగులకు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత రవాణా సేవలు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఈ అలైట్ క్యాబ్ సర్వీసులను కమిషనరేట్‌ కార్యాలయం వద్ద సీపీ అంజనీకుమార్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు, సంబంధిత సామగ్రి, పోస్టాఫీసులు, మందులు, నిత్యావసర వస్తువులు, మందులు పంపిణీ చేసే వలంటీర్లు, హెల్త్‌ వర్కర్స్‌ కు ఈ క్యాబ్‌లు ఉచితంగా సేవలు అందిస్తాయన్నారు.

24 గంటల పాటు ఈ క్యాబ్ లు అందుటబాటులో ఉండి సేవలు అందిస్తాయని ఆయన తెలిపారు. నగరంలో ప్రస్తుతం 10 క్యాబ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన తెలిపారు. అత్యవసరంగా బయటికి వెళ్లాలనుకునే వారు ఈ క్యాబ్ సర్వీసులను వినియోగించుకోవాలని ఆయన పట్టణ ప్రజలకు సూచించారు. ఈ క్యాబ్‌ సర్వీసులను పొందాలనుకునేవారు 8433958158 నంబర్‌ కు కాల్ చేసి సంప్రదించాలని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీసీపీ చౌవాన్‌, సంస్థ రీజినల్‌ హెడ్‌ శివాలి బోయిర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News