కోర్టు ముందు టపాసులు కాల్చి, డప్పులు కొట్టిన మృతుని బంధువులు

Update: 2019-07-12 16:06 GMT

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మృతదేహంతో రోడ్డుపై మృతుని బంధువులు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కమలనగర్ కాలనీ చెందిన శివ మృతి చెందగా.. బంధువులు ఆయనకు అంతిమయాత్ర నిర్వహించారు. యాత్రలో భాగంగా కోర్టు ముందు టపాసులు కాల్చడం, డప్పులు కొట్టడంతో కోర్టు మెజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేసి, వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించారు. జడ్జి తీరుపై మృతుని బంధువులు నిరసన వ్యక్తం చేస్తూ.. రహదారిపై మృతదేహంతో ధర్నా చేశారు. సుమారు రెండు గంటలపాటు ధర్నా చేపట్టారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు, బార్ అసోసియేషన్ మెంబర్స్ వచ్చి సర్ధిచెప్పడంతో.. మృతుడి బంధువులు ధర్నాను విరమించారు.

Full View

Tags:    

Similar News