ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి రైతుల ధర్నా
-ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి రైతుల ధర్నా -కొనుగోళ్లకు ముందుకు రాని వ్యాపారులు -క్వింటాల్ రూ.4,950కు కొనుగోలు చేస్తామంటోన్న వ్యాపారులు -మద్దతు ధర రూ.5,550 ఇవ్వాలని రైతుల డిమాండ్ -నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి రైతుల ధర్నా చేపట్టారు. కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. క్వింటాల్ 4 వేల 950 రూపాయలకే కొనుగోలు చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు.. అయితే రైతులు మాత్రం 5 వేల 550 మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపత్యంలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయింది.