తెలంగాణలో ఇవాళ కొత్తగా 7 పాజిటివ్ కేసుల
తెలంగాణలో ఇవాళ కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో ఇవాళ కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరింది. ఇవాళ మరో 35 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 25 మంది మరణించారు. ఇప్పటి వరకు కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 409కి చేరింది.
నాలుగు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య గణీయంగా తగ్గింది. దీంతో సీఎం కేసిఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి ఈటల రాజేంద్ర తెలంగాణలో కేసులు పూర్తిగా తగ్గుతాయని, రాష్ట్రంలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. కొన్నాళ్ళకు త్వరలోనే కోవిడ్ ఫ్రీ తెలంగాణ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.