Coronavirus: తెలంగాణలో కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు

తెలంగాణలో ఇవాళ కొత్తగా ఆరు కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Update: 2020-04-28 13:19 GMT
Representational Image

తెలంగాణలో ఇవాళ కొత్తగా ఆరు కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 1009కి చేరినట్లు మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఇప్పటివరకు 374మంది కోలుకున్నారు. ఈ వైరస్‌ బారిన పడి 25 మంది మృతి చెందారు.

ఈ ఒక్క రోజే 42మంది డిశ్చార్జి అయినట్టు మంత్రి చెప్పారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 610మంది బాధితులు చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 50శాతానికి పైగా కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్టు వెల్లడించారు.


Tags:    

Similar News