తెలంగాణలో 300 దాటిన కరోనా కేసులు
కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే..
కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయినప్పటకి దేశంలో కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు.. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 300 దాటింది. అత్యధికంగా హైదరాబాద్ 140మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇక ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఈ రోజు 26 కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252 కు చేరింది. అటు దేశవ్యాప్తంగా 3374 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 79 మంది మృతి చెందారు.