పార్లమెంట్‌కు చేరిన ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ వ్యవహారం

Update: 2020-03-13 06:12 GMT
MP Revanth Reddy

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యవహారం పార్లమెంట్‌కు చేరింది. అక్రమంగా రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారంటూ కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. మరోపక్క కాంగ్రెస్‌ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు లేఖ రాశారు. ఎంపీ రేవంత్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేసి ప్రభుత్వం బెయిల్‌ రాకుండా చేస్తోందని ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. అసలు ఏం జరిగిందో కనుక్కోవాలని స్పీకర్‌ను కోరారు. అయితే కాంగ్రెస్‌ ఎంపీల లేఖపై స్పందించిన స్పీకర్ సమాచారం తెప్పించుకొని పరిశీలిస్తానన్నారు.

Tags:    

Similar News