కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఇంతవరకు బొట్టు కూడా వినియోగంలోకి రాలేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 50 రోజుల నుండి కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వృథాగా సముద్రంలోకి పోతుందని తెలిపారు. ఇప్పటి వరకు కేవలం 16 టీఎంసీల నీరు మాత్రమే ఎత్తిపోశారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి పెద్ద విద్యుత్ భారమని పేర్కొన్నారు.