Tamilisai Soundararajan: గవర్నర్‌తో కాంగ్రెస్ నేతల భేటీ

Update: 2020-05-04 07:43 GMT

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మర్రి శశిధర్ రెడ్డి భేటీ అయ్యారు. లాక్‌డౌన్‌లో రైతుల సమస్యలు, కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వ నిర్లక్క్ష్యంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్‌ కుమార్‌ గవర్నర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. కరోనా టెస్టులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News