లోక్ సభలో తెలంగాణ ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. పలువురు ఎంపీలు తమ మాతృబాష తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. కొందరు సభ్యులు, ప్రమాణస్వీకారం చేసిన వెంటనే జై తెలంగాణ అంటూ నినాదం చేశారు. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి వెరైటీగా ప్రమాణం చేశారు. మిగిలిన సభ్యుల్లా పేపర్ పై రాసిన ప్రతిజ్ఞను చదవకుండా మొబైల్ ఫోన్ లో చూసి తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు రేవంత్ ప్రమాణస్వీకారం చేసేందుకు వస్తుండగా ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరిచారు.