జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Update: 2020-02-04 12:18 GMT

హైదరాబాద్ మెట్రో రైలులో మరో ముందడుగు పడనుంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు ప్రారంభంకానుంది. ఈ నెల 7న సీఎం కేసీఆర్ ఈ సరికొత్త మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే నిర్మాణం, ట్రయల్‌ రన్‌ పూర్తి చేసుకుని మెట్రోరైలు భద్రతా శాఖ నుంచి 20 రోజుల క్రితమే అనుమతులు పొందింది.

ఈ విషయాన్ని తెలంగాణ మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. నాగోల్ – హైటెక్ సిటీ కారిడార్ 29 కిలోమీటర్లు, మియాపూర్ -ఎల్బీ నగర్ కారిడార్‌ 29 కిలోమీటర్లు ప్రస్తుతం మెట్రో రైలు నడుస్తుండగా, మూడో కారిడార్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 15 కిలోమీటర్ల వరకు అందుబాటులోకి రానుంది.


 

Tags:    

Similar News