ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లా కరివెనకు చేరుకున్నారు. కరివెన జలాశయం పనులను కేసీఆర్ పరిశీలించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను సీఎం పరిశీలిస్తున్నారు. ఇంజనీర్లు పనుల పురోగతిని సీఎంకు వివరించారు. ప్రాజెక్టు పనులపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.