రేపు కరీంనగర్ కు సీఎం కేసీఆర్.. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించనున్న కేసీఆర్
సీఎం కేసీఆర్ రేపు కరీంనగర్ లో పర్యటించనున్నారు. కరోనా నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. కరీంనగర్ లో పరిస్థితులను కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఇండోనేషియా నుంచి ఇటీవల కరీంనగర్ కు వచ్చిన కొందరు మత ప్రభోధకులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అయింది. దీంతో రంగంలో దిగిన ఆరోగ్య శాఖ కరీంనగర్ మొత్తం ఇంటింటికి తిరిగి వైద్య పరీక్షలు చేపట్టారు. స్థానికులు ఎవరికీ కరోనా సోకకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. కరీంనగర్లో పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు కేసీఆర్ ఈ రోజే పర్యటించాలని భావించారు. ఈ రోజు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో పర్యటనను రేపటికి వాయిదా వేసుకున్నారు.