ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మరోసారి సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్తోపాటు ఆర్టీసీ, రవాణా, పోలీస్ ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు ఆదేశాలపై చర్చిస్తున్నారు. ఇక, ఆర్టీసీ కార్మికుల వేతనాల చెల్లింపు, అవసరమైన నిధులపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.