వంద కోట్ల రూపాయలతో నూతన అసెంబ్లీ సముదాయాన్ని నిర్మించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఎర్రమంజిల్ కాంప్లెక్స్ ప్రాంతంలోని 17 ఎకరాల్లో కొత్త అసెంబ్లీని నిర్మిస్తామని తెలిపారు. ప్రస్తుతమున్న అసెంబ్లీ డిజైన్లోనే నూతన అసెంబ్లీ సముదాయాన్ని చేపడతామని కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణలో ఇక మున్సిపల్ ఎన్నికలు మాత్రమే మిగులున్నాయని, వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కుదిరితే జులైలోనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడించారు.