బ్రేకింగ్ న్యూస్ : సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్‌ సభ రద్దు

Update: 2019-10-17 09:11 GMT

భారీ వర్షం కారణంగా సీఎం కేసీఆర్‌ హుజూర్‌నగర్‌ సభ రద్దైంది. గంట నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షం కారణంగా సభా ప్రాంగణం తడిసిముద్దైంది. అప్పటికే చేరుకున్న జనం పరుగులు తీశారు. దీంతో సభను నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం వరకు ధాటిగా ఎండ కొట్టినా మధ్యాహ్నం అకస్మాత్తుగా వర్షం పడింది. దీంతో కేసీఆర్‌ సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు సభను జరగాలి. హుజూర్‌నగర్‌కు బయల్దేరేందుకు సీఎం కేసీఆర్‌ కూడా సిద్ధపడ్డారు. అయితే అంతలోనే వర్షం పడటంతో కేసీఆర్‌ సభను రద్దు చేయాల్సి వచ్చింది. 

Tags:    

Similar News