జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రో సర్వీసును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 11 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 9 మెట్రో స్టేషన్లున్నాయి. ఇటు ప్రారంభించిన తర్వాత జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు కేసీఆర్ మెట్రోలో ప్రయాణించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ప్రభుత్వ, మెట్రో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.