తాగడానికి మాకు నీళ్ళను ఇవ్వండి అంటూ చిన్నారులు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కి లేఖ రాశారు. మాకు నీళ్ళు సరిగ్గా రావడం లేదని, ఉన్న నీళ్ళు కూడా కలుషుతం అవుతున్నాయని హైదరాబాద్లోని అల్కాపూర్ టౌన్ షిప్కు చెందిన కొందరు చిన్నారులు కేసీఆర్, కేటీఆర్ లకు తమ సమస్యలను వివరిస్తూ లేఖలు రాశారు. తాము తాగేందుకు స్వచ్చమైన నీరు కావాలని, అది ప్రతి మానవుడి ప్రాధమిక హక్కు అని , మేము 5 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఆ లేఖలని హైదరాబాద్ మెట్రోపొలిటన్ వాటర్ సప్లై అండ్ సెవెరేజ్ బోర్డుకి కూడా వారు పోస్టు కార్డులు పంపారు.
Hyderabad: Children from Alakaapoor Township have written to Telangana CM K. Chandrashekar Rao demanding supply of water to their area, state, "We need water, we are waiting for 5 years." pic.twitter.com/y5paS7251c
— ANI (@ANI) October 29, 2019