విద్యార్థిని కొట్టినందుకు ప్రిన్సిపల్ పై కేసు నమోదు
కూకట్ పల్లిలోని శ్రీ చైతన్య ఐఐటి అకాడమీ ప్రిన్సిపాల్పై పోలీసులు కేసు నమోదు చేసారూ.
కూకట్ పల్లిలోని శ్రీ చైతన్య ఐఐటి అకాడమీ ప్రిన్సిపాల్పై పోలీసులు కేసు నమోదు చేసారూ. ఆ కళాశాలలో చదువుతున్నఓ విద్యార్థిని కడుపులో పలుమార్లు కొట్టినందుకు ఆ విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం బాలుడు తన క్లాస్మేట్తో కలిసి కారిడార్లో నిలబడి ఉండగా ప్రిన్సిపల్ కొట్టాడని తెలిపారు. రెండు నెలల క్రితం కళాశాల ప్రిన్సిపల్ కి బాలుడి తల్లిదండ్రులకి గొడవ జరిగిందని తెలిపారు. అది మనసులో పెట్టుకుని ఆ కళాశాలలో ఎంపిసి చదివే బాలున్ని కొడుతున్నాడని వారు తెలిపారు. దీంతో ప్రిన్సిపల్ హరిబాబుపై పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.