జీహెచ్ఎంసీ అధికారులకు షాక్ ; గుంతలో పడి కాలు విరిగిందని డబీర్పురలో కేసు
హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.... దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయో చెప్పే దృశ్యమిది.రోడ్డుపై గుంతలతో కాలు విరగ్గొట్టుకున్న ఓ బాధితుడు జీహెచ్ఎంసీకి దిమ్మతిరిగే షాకిచ్చాడు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన కాలు విరిగిపోయిందంటూ కేసు పెట్టేశాడు. హైదరాబాద్లో ఉన్న గుంతలు పూడ్చాలంటే కాలో చేయో విరగాల్సిందేనా.... ఇలా కేసులు పెట్టాల్సిందేనా? అది జరిగితేనే కానీ గుంతలు పూడ్చరా అధికారులు... ఇప్పుడివే ప్రశ్నలు నగర ప్రజలను ఆలోచింపచేస్తున్నాయ్. జీహెచ్ఎంసీపై కేసు పెట్టిన వ్యక్తి పేరు సయ్యద్ అజ్మత్ హుస్సేన్ జాఫ్రీ. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమే తన కాలు విరగడానికి కారణమంటూ ఠాణా మెట్లెక్కాడు. తాను బైక్పై వెళ్తుండగా ఓ గుంతలో పడ్డానని, అప్పుడే తన కాలు విరిగిందని చెబుతున్నారు సయ్యద్.