ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు

Update: 2019-12-07 05:51 GMT
చటాన్‌పల్లి

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతానికి సంబంధించి షాద్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న షాద్‌నగర్‌ ఏసీపీ వి.సురేంద్ర ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. నిందితులను తీసుకుని నేర ఆధారాల సేకరణకు చటాన్‌పల్లిలోని ఘటనా స్థలానికి వెళ్లామని, అక్కడ నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌ గౌడ్‌ తీవ్రంగా గాయపడ్డారని, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు నిందితులు హతమైనట్లు వివరించారు. 

Tags:    

Similar News