జోగులాంబ గద్వాల జిల్లా భీంపూర్‌లో కూలిన బ్రిడ్జి.. నిలిచిపోయిన రాకపోకలు

Jogulamba Gadwal: 30 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన...

Update: 2021-12-15 06:35 GMT

జోగులాంబ గద్వాల జిల్లా భీంపూర్‌లో కూలిన బ్రిడ్జి.. నిలిచిపోయిన రాకపోకలు

Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలం భీంపురం గ్రామ సమీపంలోని జూరాల ప్రాజెక్ట్ కుడి కాలువపై నిర్మించిన వంతెన కూలిపోయింది. సుమారు 30 ఏళ్ల క్రితం ఈ వంతెన నిర్మించారు. కాంక్రీట్ వాహనం బ్రిడ్జి మీదుగా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ వంతెన మీద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహన డ్రైవర్ చాకచక్యంగా వంతెనపై వాహనాని ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. బ్రిడ్జి కూలడంతో వాహన రాకపోకలను ఇతర మార్గాల గుండా మళ్ళించారు పోలీసులు.

Tags:    

Similar News