నేటి నుంచి తెలంగాణ ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలు

తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు ఇక నుండి ఆన్‌లైన్ కానున్నాయి. దేవాలయాల్లో ముందుగా వరంగల్‌లోని భద్రకాళి, భద్రాచలం, పెద్దమ్మ తల్లి దేవాలయాలకు సంబంధించి ఆన్‌లైన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

Update: 2019-09-04 00:48 GMT

తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు ఇక నుండి ఆన్‌లైన్ కానున్నాయి. దేవాలయాల్లో ముందుగా వరంగల్‌లోని భద్రకాళి, భద్రాచలం, పెద్దమ్మ తల్లి దేవాలయాలకు సంబంధించి ఆన్‌లైన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ సేవలను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఇక, ఆయా ఆలయాల్లో ఆర్జిత సేవలు, గదుల్ని ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవచ్చు. దీనిలో భాగంగా పూజలు, ప్రత్యేక సేవలు, ప్రసాదం నిత్య కళ్యాణం, హోమాల సేవలను ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవచ్చు. టీ యాప్ ఫోలియో ద్వారా కూడా ఈ బుక్ చేసుకోవచ్చు. 

Tags:    

Similar News