ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘనంగా బోనాలు

*అమ్మవారికి బోనం సమర్పించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Update: 2022-07-06 06:47 GMT

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘనంగా బోనాలు

Delhi: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బోనం సమర్పించారు. వచ్చే ఏడాది నుంచి ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించనున్నట్లు కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు కేంద్ర టూరిజం శాఖ తరపున నిధులు కేటాయిస్తామన్నారు. ఢిల్లీలో మరింత వైభవంగా బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. లాల్‌దర్వాజ బోనాల కమిటీ ఇతర దేవాలయాలను కలుపుకొని ఉత్సవాలు నిర్వహించాలన్నారు.

Full View


Tags:    

Similar News