Revanth Reddy: బీజేపీ మేనిఫెస్టో చెల్లని బ్యాంక్‌ చెక్కులా ఉంది

Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో I.N.D.I.A కూటమిదే విజయం

Update: 2024-04-14 11:04 GMT

Revanth Reddy: బీజేపీ మేనిఫెస్టో చెల్లని బ్యాంక్‌ చెక్కులా ఉంది

Revanth Reddy: సార్వత్రిక ఎన్నికల్లో 2004 చరిత్ర పునరావృతమవుతోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ సారి బీజేపీ కూటమి ఓడిపోతుందని.... ఇండియా కూటమి విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. 2004లో షైనింగ్ ఇండియా మేనిఫెస్టోతో పోటీకి దిగిందని... ప్రస్తుతం వికసిత్ భారత్ పేరుతో అదే పాత ప్రయోగం చేసిందని విమర్శించారు. అప్పుడు వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీ పాలనను... సోనియాగాంధీ నేతృత్వంలో దేశ ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. గతంలోని పరిస్థితులు ఇప్పుడూ ఉన్నాయన్నారు. నాటిలాగే వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీజేపీని తిరస్కరించి.... రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను గెలిపిస్తారన్నారు. బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో చెల్లని బ్యాంకు చెక్కులా ఉందని ఆక్షేపించారు.

Tags:    

Similar News