Chendupatla Janga Reddy: మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూత

Chendupatla Janga Reddy: హన్మకొండ నుంచి పీవీ నర్సింహారావుపై గెలుపొందిన జంగారెడ్డి

Update: 2022-02-05 05:22 GMT

మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూత

Chendupatla Janga Reddy: బీజీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. కొంతకాలంగా జంగారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1935 నవంబర్ 18న వరంగల్ జిల్లాలో జంగారెడ్డి జన్మించారు. ప్రస్తుతం ఆయన హన్మకొండలో నివాసం ఉంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీపీ నుంచి లోక్ సభకు ప్రాతినిద్యం వహించారు. హన్మకొండ పార్లమెంట్ స్థానం నుంచి పీవీ నర్సింహారావుపై 54 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. జంగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు కొద్ది రోజులు ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ టీచర్ గా పని చేశారు. 

Tags:    

Similar News