బ్యాంకులకు వరుసగా మూడు రోజుల సెలవులు
నేటి నుంచి బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. నేడు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం, రేపు నాలుగో శనివారం, ఇక ఎల్లుండి ఆదివారంతో కలిపి వరుసగా మూడు రోజులు బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం నవ్యాంధ్రలో సెలవులు ప్రకటించినట్లు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.
నేటి నుంచి బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. నేడు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం, రేపు నాలుగో శనివారం, ఇక ఎల్లుండి ఆదివారంతో కలిపి వరుసగా మూడు రోజులు బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం నవ్యాంధ్రలో సెలవులు ప్రకటించినట్లు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. అయితే బ్యాంకు వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏటీఎంలలో డబ్బులు నింపామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఇక తిరిగి మళ్లీ సోమవారం నుండి బ్యాంకుల్లో నగదు లావాదేవీలు ఎప్పటిలాగే జరుగుతాయని తెలిపారు. అయితే ఇటివలే వరుసగా నాలుగురోజులు సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తిరిగి మళ్లీ మరో మూడురోజులు వరస సెలవులు రావడంతో తెగ సంబురపడిపోతున్నారు బ్యాంక్ కొలువుదారులు.