Bandi Sanjay - KCR: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ

Bandi Sanjay - KCR: *రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐదుపేజీల లేఖ *లక్ష రూపాయల రుణ మాఫీని అమలు చేయాలని డిమాండ్‌

Update: 2021-09-24 05:49 GMT

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ

Bandi Sanjay - KCR: సీఎం కేసీఆర్‌కు టీ.బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐదుపేజీల లేఖ రాశారు ఆయన. ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లక్ష రూపాయల రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ వరిపంట వేయొద్దన్న ప్రకటన ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్న బండి సంజయ్‌.. ధరణిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలంటూ లేఖలో తెలియజేశారు.రైతులకు న్యాయం జరిగేవరకు బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు బండి సంజయ్‌.

Tags:    

Similar News