అసదుద్దీన్ ఓవైసీ పిలుపుకి అద్భుత స్పందన

భారత్‌లో ముస్లింలు తమ దేశభక్తిని పదే పదే నిరూపించుకోవాల్సి వస్తోందని, దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం ఇంటిపై జాతీయ జెండా

Update: 2019-12-24 16:56 GMT
Asaduddin Owaisi

భారత్‌లో ముస్లింలు తమ దేశభక్తిని పదే పదే నిరూపించుకోవాల్సి వస్తోందని, దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పిలుపును ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఆ పిలుపుకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ముస్లిం సోదరుల ఇళ్లపై జాతీయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పాతబస్తీతో మొదలుకొని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులు త్రివర్ణ పతకాన్ని ఎగరేసి తమ దేశభక్తిని చాటుకున్నారు.

మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో పాతబస్తీలోని దారుస్సలాంలో శనివారం (డిసెంబర్ 21) రాత్రి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఇదే సభలో భారతదేశం బిన్నత్వంలో ఏకత్వమని ఒక్క హిందువులకు మాత్రమే కాదని వాఖ్యానించారు. ఈ గడ్డపై పుట్టిన ముస్లింలు పుట్టుకతోనే భారతీయులని అసదుద్దీన్ ఓవైసీ వాఖ్యానించారు.  


Delete Edit


Tags:    

Similar News