ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఏకమై ప్రవహిస్తూ ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొమరం భీం జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల కల్వర్టుల పైన నీరు ప్రవహిస్తూ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చింత కుంట చెక్ డ్యాం దగ్గర నీటి ప్రవాహంలో ఓ ఆటో చిక్కుకుంది. వెంటనే స్పందించిన చుట్టుపక్కల వారు అతి కష్టం మీద ఆటో డ్రైవర్ను కాపాడారు.